రాష్ట్రంలో కీలక పరిణామం.. CM రేవంత్‌తో మూడు పార్టీల నేతలు భేటీ

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతల భేటీ అయ్యారు.

Update: 2024-05-25 06:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతల భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై చర్చ జరుపుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News