మత కలహాలు కావాలా.. శాంతి కావాలా.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.
దిశ, వెబ్డెస్క్: యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ యువసమ్మేళనంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశంలో మత కలహాలు కావాలా.. శాంతి కావాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాకిస్థాన్ ఏమనుకుంటే దేశంలో అది జరిగేదన్నారు. బీజేపీ పాలనలో పాకిస్థాన్ తోక కత్తిరించామన్నారు. మోడీ హయాంలో పాకిస్థాన్లోకి చొచ్చుకుని పోయి సర్జికల్ స్ట్రైయిక్ చేసి తీవ్రవాదులను ఏరేశామన్నారు. పదో తారీఖున ప్రదాని మోడీ సభకు యువత పెద్ద ఎత్తున హాజరు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా మోడీ సభ ఉండాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు.
Read More...