పవన్‌ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ.. చర్చించిన అంశం ఇదే..!

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ బుధవారం భేటీ అయ్యారు.

Update: 2023-10-18 08:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ బుధవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతును కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరారు. దీనికి స్పందించిన పవన్ కల్యాణ్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈరోజు జనసేన ముఖ్యనేతలు, కార్యకర్తలతో పవన్ భేటీ హైదరాబాద్ పార్టీ ఆఫీస్ లో భేటీ అయిన విషయం తెలిసిందే.. బీజేపీకి తొలి నుంచి పవన్ మద్దతుగా నిలుస్తున్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీతో పొత్తు అంశంలో తీసుకునే నిర్ణయంపై పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News