రేపు లయన్స్ క్లబ్ గవర్నర్-2 నంబూరు మధు సంస్మరణ సభ

వైరాకు చెందిన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, దాల్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నంబూరు మధుసూదన్ రావు సంస్మరణ సభ, దశ దిన ఖర్మలను శనివారం నిర్వహించనున్నారు.

Update: 2024-05-03 14:48 GMT

దిశ, వైరా : వైరాకు చెందిన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, దాల్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నంబూరు మధుసూదన్ రావు సంస్మరణ సభ, దశ దిన ఖర్మలను శనివారం నిర్వహించనున్నారు. వైరాలోని వాసవి కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ వైరా, గ్రేట్ విజన్ క్లబ్ వైరా ఆధ్వర్యంలో ఈ సంస్మరణ సభను నిర్వహించనున్నారు. ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ తీగల మోహనరావు, జిల్లా గవర్నర్ సీహెచ్ వీ శివప్రసాద్,

    వైస్ డిస్టిక్ గవర్నర్-1 యారాల ప్రభాకర్ రెడ్డి, మల్టిపుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ గోలి అమరేందర్ రెడ్డి, గాట్ అంబాసిడర్లు డాక్టర్ కాపా మురళీకృష్ణ, జగిని భీమయ్య, ఎన్.బాలయ్య, దారా కృష్ణారావు, యారాల మోహన్ రెడ్డి, మోతుకూరి మురళీధర్ రావు, ఆర్. రాఘవరెడ్డి, వెంపటి లక్ష్మీనారాయణ, రఘుపతి నేతి, ఆర్. గోపాల్ రెడ్డి, డీసీఎస్, డీసీటీ, జీఎంటీ, జీఎస్టీ జీఎల్టీ ,జీఈటీ కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. కావున లయన్స్ క్లబ్ సభ్యులు సకాలంలో హాజరై సభను విజయవంతం చేయాలని వైరా క్లబ్ ప్రతినిధులు కోరారు.

Similar News