బీజేపీతోనే సుస్థిర పాలన

బీజేపీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని, ప్రధానిగా మోదీని గెలిపిస్తేనే దేశంలో పాలన బాగుంటుందని ఖమ్మం పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు.

Update: 2024-04-26 12:42 GMT

దిశ, ములకలపల్లి : బీజేపీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని, ప్రధానిగా మోదీని గెలిపిస్తేనే దేశంలో పాలన బాగుంటుందని ఖమ్మం పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మంపేట, పొగళ్లపల్లి, ఒడ్డుగూడెం, చౌటిగూడెం గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న ప్రదేశానికి వెళ్లి ఆయన కూలీలతో మాట్లాడారు. అనంతరం ములకలపల్లిలో రోడ్ షో ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ములకలపల్లి లో పార్టీ ఆఫీసుని ప్రారంభించి మాట్లాడారు.

    ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉభయ జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతానన్నారు. నరేంద్ర మోడీ దూతగా మీరంతా తనని ఆశీర్వదించాలని, ఈ ఎన్నికల్లో బీజేపీని మరోసారి బలపరిచి సుస్థిరమైన పాలనకు అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన మహిళలు, కూలీలు బీజేపీలో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్, పార్లమెంట్ ప్రబారి నంబూరి రామలింగేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ గొట్టేపూడి దుర్గా శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు అనుమోలు శ్రీనివాస్, కార్యదర్శి శనగపాటి సీతారాములు, అప్పయ్య, పోలయ్య పాల్గొన్నారు.

Similar News