రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

బోనకల్ మండలం గోవిందపురం ఎల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Update: 2024-04-25 03:14 GMT

దిశ, బోనకల్: బోనకల్ మండలం గోవిందపురం ఎల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గుణదల ప్రయాణం చేస్తున్న వీరి కారు తెల్లవారుజామున కోదాడ సమీపంలో లారీ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఓకే కుటుంబ సభ్యులు మరణించారు. ఈ పిడుగు లాంటి వార్త విని గోవిందపురం గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్లమల్ల చందర్రావు కుటుంబం బతుకుతెరువు కోసం హైదరాబాద్ వెళ్లి కుటుంబం అంతా ఒక్కసారి శవాలతో ఇంటికి రావడం బాధాకరమని ప్రజలంతా విలపిస్తున్నారు. మృతుల ఆరుగురు నల్లమల చంద్రరావు(47) నల్లమల్ల మాణిక్యం(43) నల్లమల కృష్ణంరాజు (25) కోడలు ఇద్దరు పిల్లలుగా గుర్తించారు.

Similar News