కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యే లపై హైకోర్టులో పిటిషన్

తమ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-04-25 11:03 GMT

దిశ, భద్రాచలం టౌన్ : తమ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ,భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై పిటిషన్ వేశారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించాలని ఆయన కోరారు. ఇవాళ దీనిపై హైకోర్టు విచారించనుంది.

Similar News