ఎంపీ సోయం బాపూరావు పర్యటన విజయవంతం..

ఆదిలాబాద్ ఎంపీ, ఆదివాసీ నాయకుడు సోయం బాపూరావు సోమవారం మండలంలోని సీతారాంపురం పరిధిలో సోయంగంగులు గూడెంలో పర్యటించారు.

Update: 2023-04-24 13:30 GMT

దిశ, ములకలపల్లి : ఆదిలాబాద్ ఎంపీ, ఆదివాసీ నాయకుడు సోయం బాపూరావు సోమవారం మండలంలోని సీతారాంపురం పరిధిలో సోయంగంగులు గూడెంలో పర్యటించారు. అనంతరం గంగులుగూడెంలో గిరిజనులతో మాట్లాడి ఆదివాసీలు సమస్యలను తెలుసుకున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా ఈ గ్రామంలో సమస్యలన్నీ తీర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో సోయం సత్యనారాయణ, ఊకే ముక్తేశ్వరవు, బాడిశ బిక్షం దొర, సోయం చిన్నారి, సత్యనారాయణ, పద్దం నాగరాజు, కొండ్రు పద్మ, ఊకే పెద్దమ్మాయి, సడియం వెంకటేష్, తానం లక్ష్మీ, వగ్గేల భద్రం, రత్తమ్మ, పద్మ, నాగమణి, పాల్గొన్నారు.

Tags:    

Similar News