అక్రమ మద్యం సరఫరాను అరికట్టాలి

బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్​లో గురువారం రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చతీస్​ఘడ్​ మూడు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో అంతరాష్ట్ర సరిహద్దు సమావేశం నిర్వహించారు.

Update: 2024-03-28 10:53 GMT

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్​లో గురువారం రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చతీస్​ఘడ్​ మూడు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో అంతరాష్ట్ర సరిహద్దు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల దృష్ట్యా అక్రమంగా మద్యం సరఫరా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున మూడు రాష్ట్రాల ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో అరికట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాలకు చెందిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Similar News