పిడుగుపాటుకు ఐదు ఆవులు మృతి

ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి అకాల వర్షంతోపాటు పిడుగులు పట్టడంతో నడిమిగూడెం... Five cows died due to lightning

Update: 2023-03-19 06:45 GMT

దిశ, గుండాల: ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి అకాల వర్షంతోపాటు పిడుగులు పట్టడంతో నడిమిగూడెం గ్రామపంచాయతీలోని సంది బంధం గ్రామంలో పిడుగుపాటుకు రైతులకు చెందిన ఐదు ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. బొమ్మల లక్ష్మయ్యకి చెందిన మూడు ఆవులు, ఈసం సత్యంకు చెందిన ఒక ఆవు, బొమ్మల ఆంజనేయులకు చెందిన ఒక ఆవు పిడుగుపాటుకు మృతిచెందాయి. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News