తమ్మినేని హత్య కేసులో 8 మంది నిందితుల‌కు రిమాండ్

దిశ, ఖమ్మం రూరల్​: ఆగస్టు 15 న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనం - Eight accused in Tammineni murder case remanded

Update: 2022-08-19 17:09 GMT

దిశ, ఖమ్మం రూరల్​: ఆగస్టు 15 న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను శుక్రవారం రాత్రి ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి పీ. మౌనిక ఎదుట ఖమ్మం రూరల్ పోలీసులు హాజరుపరిచారు. నిందితులను నేటి నుంచి 14 రోజుల వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితులను భారీ పోలీస్ బందోబస్తు నడుమ జైలుకు తరలించారు.


రిమాండ్‌కు తరలించ వారి వివరాలు ఎస్​కే రంజాన్, జక్కంపుడి క్రిష్ణ, బోడ పట్ల శ్రీను, గజ్జి క్రిష్ణ స్వామి, బండారు నాగేశ్వరరావు, నూకల లింగయ్య, కన్నెగంటి నవీన్, మాకరపు లక్ష్మయ్యలను జిల్లా జైలుకు తరలించారు. ఇంకా ఏ1గా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు, యల్లంపల్లి నాగయ్యలు పరారీలో ఉన్నారు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడ అదుపులోకి తీసుకున్నారు. వారిలో నవీన్, లక్ష్మయ్యలను ఎఫ్ఐఆర్‌లో లేని పేర్లుగా తెలుస్తోంది. అయితే వారిలో నవీన్ ​మాత్రం ఆటో డ్రైవర్ ​అని తెలుస్తోంది. నిందితుల నుంచి ఐదు ఆయుధాలు, ఒక ఆటో, తొమ్మిది సెల్​ఫోన్స్, 3 బైక్స్, 2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News