ఖమ్మం ఎంపీ నామాను కలిసిన బీఆర్ఎస్ నేతలు

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావును బీఆర్ఎస్ నేతలు ఆయన నివాసంలో కలిశారు.

Update: 2023-02-19 09:33 GMT

దిశ, కారేపల్లి: తెలంగాణ రాష్ట్ర లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావును బీఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ లు ఖమ్మం లోని ఆయన నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మండలంలోని పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తమకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మండలంలోని సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News