బైక్ అదుపుతప్పి: వ్యక్తి మృతి

బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందిన ఘటన పాల్వంచ మండలం కొత్తూరు వద్ద శనివారం చోటుచేసుకుంది.

Update: 2023-02-18 17:25 GMT

దిశ, పాల్వంచ: బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందిన ఘటన పాల్వంచ మండలం కొత్తూరు వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడానికి చెందిన ఇద్దరు యువకులు తమ బంధువుల దగ్గరికి వచ్చి వెళ్తుండగా మార్గమధ్యలో ఉలవనూరు వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరోకరికి స్వల్ప గాయలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News