బీఆర్​ఎస్​కు మరో షాక్​...కాంగ్రెస్​ గూటికి ఖమ్మం మేయర్​

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.

Update: 2024-05-03 11:09 GMT

దిశ, ఖమ్మం సిటీ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి వలసలు పెరుగుతూనే వస్తున్నాయి. అయితే ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకోలు నీరజ, ఆమె భర్త బ్రహ్మం లు మొదటి నుండి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు అనుచరులు కావడంతో

    కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఖాయమని దిశ ముందుగానే చెప్పింది. అయితే పార్టీ మారడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అన్న నేపథ్యంలో పార్టీ మార్పు కొంతకాలం దూరం పెట్టినప్పటికీ శుక్రవారం మేయర్ హైదరాబాద్​లో రాష్ట్ర మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాక 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపుడి రమాదేవి, సతీష్ లు,13వ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ లు కాంగ్రెస్​లో చేరారు. 

Similar News