చెరువులో పడి వ్యక్తి మృతి
చేపల వేటకు వెళ్లి ఇనికే సుధాకర్ (34) చెరువులో మునిగి మృతి చెందాడు.
దిశ, ములకలపల్లి : చేపల వేటకు వెళ్లి ఇనికే సుధాకర్ (34) చెరువులో మునిగి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాం గ్రామానికి చెందిన సుధాకర్ ఒక్కడే చేపలు పట్టేందుకు చింతలచెరువు లోకి వెళ్లాడు. లోతు ఎక్కువ ఉండటంతో అందులో మునిగిపోయాడు. మృతుడికి భార్య దుర్గ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.