ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-06 07:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నిందితులు తప్పించుకోవడానికి యత్నిస్తున్నారన్నారు. నిందితులను ప్రయత్నాలను నిర్వీర్యం చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించామన్నారు. కీలక నిందితుల అరెస్ట్ కు యత్నిస్తున్నామన్నారు. కేసుతో సంబంధం ఉన్న వారు ఎంతటివారైన వదలేదు లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News