కళ్యాణం.. కమనీయం...

అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.... Sriramanavami festival celebrations

Update: 2023-03-30 10:02 GMT

దిశ, జమ్మికుంట: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధికంగా పోటెత్తారు. దీంతో భారీగా వాహనాల రాకతో ట్రాఫిక్ గా అంతరాయం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు ఇల్లంతకుంట సీతారామ కళ్యాణం వీక్షించడానికి వచ్చారు. సీతారామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘ అధ్యక్షుడు బోయినపల్లి వినొద్ కుమార్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్చార్జి బల్మూరి వెంకట్, కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ బృందం, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News