వైభవంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం

వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లిలో శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

Update: 2023-02-06 16:46 GMT

దిశ, వెల్గటూర్: మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి ఊరేగింపు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి రథం వద్ద కొబ్బరికాయలు కొట్టి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రథోత్సవంలో ఆలయ కమిటీ ఛైర్మన్ మార్గం సతీష్, సర్పంచ్ చల్లూరి రూపారాణి రాంచందర్ గౌడ్, ఎంపీటీసీ పోడేటి సతీష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోడేటి రవి, వార్డు సభ్యులు దుబ్బ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Similar News