దిశ ఎఫెక్ట్... నేతన్నలకు శుభవార్త

సిరిసిల్ల నేత కార్మికులకు 14 రోజుల కింద రూ. 50 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా నాయకుల మధ్య...Special Story of Bathukamma Cheeralu's Amount

Update: 2022-12-06 14:48 GMT

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల నేత కార్మికులకు 14 రోజుల కింద రూ. 50 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా నాయకుల మధ్య సమన్వయ లోపంతో కార్మికుల ఖాతాలో జమ చేయకుండా జాప్యం చేసిన విషయాన్ని "దిశ" కథనం ప్రచురించిన విషయం విధితమే. బిల్లుల చెల్లింపు జాప్యంపై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆసాములు, వ్యాపారులు సిరిసిల్లకు చెందిన నామినేటెడ్ పోస్ట్ నాయకులపై అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులు సోదరుడిని కలిసి నిధులు విడుదల చేయాల్సిందిగా కోరగా హైదరాబాద్ అధికారులతో మాట్లాడి రూ. 50 కోట్ల రూపాయలను కార్మికుల ఖాతాలో మంగళవారం జమ చేయించారు. సంఘాల ఖాతాలో డబ్బులు జమ కావడంపై ఎస్ఎస్ఐ.. మ్యాక్స్ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపునకు సహకరించిన పవర్ లూం టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.



Similar News