ఉచిత హామీలు వద్దు.. పనులు చెయ్... ఎమ్మెల్యే రసమయిపై ఆగ్రహం

రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకతీతంగా మండల కేంద్రంలోని...Protest against MLA Rasamai

Update: 2022-11-26 14:26 GMT

దిశ, మానకొండూరు: రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకతీతంగా మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో రోడ్డుపై ధర్నాకు దిగారు. మానకొండూర్ నుంచి జమ్మికుంట వరకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రాఘవపూర్ నుంచి మానకొండూర్ వరకు అక్కడక్కడ పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేయగా గ్రామ సర్పంచ్ ఈనెల 25న మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు అంటూ శనివారం అన్నారం గ్రామంలో రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఉచిత హామీలు నమ్మేది లేదని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఎన్నో మార్లు తీసుకెళ్లినా రొడ్డుపనులు జరగటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హామీ ఇస్తే తప్ప విరమించము అంటూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఆందోళన సుమారు 3 గంటలపాటు నిర్వహించారు. వీరికి మద్దతుగా సంఘీబావంగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిషానీ రాం చంద్రం పాల్గొన్నారు. 

Tags:    

Similar News