కొండగట్టు అంజన్న చెంత సీతారాముల కళ్యాణం

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో శ్రీరామనవమిని

Update: 2024-04-17 11:58 GMT

 దిశ,మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికను ఏర్పరిచి శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపు గా పందిరిలోకి తీసుకువచ్చి కల్యాణం జరిపించారు. అంజన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు, హనుమాన్ మాలా దారులు ఈ వేడుకలో పాల్గొని కళ్యాణం తిలకించి తరించారు.అంజన్న క్షేత్రం రామనామ స్మరణతో మారు మోగింది.కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Similar News