కొడుకు ఇలాకాకు కేసీఆర్.. గులాబీ బాస్ ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ..!

కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల పట్టణానికి నేడు గులాబీ బాస్ కేసీఆర్ రాబోతున్నారు.

Update: 2024-05-10 08:30 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల పట్టణానికి నేడు గులాబీ బాస్ కేసీఆర్ రాబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర శుక్రవారం సిరిసిల్లకు చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటలకు స్థానిక కొత్తచెరువు నుంచి నేతన్న చౌక్ వరకు నిర్వహించనున్న రోడ్ షో లో గులాబీ బాస్ కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరిగ్గా నెల రోజుల క్రితం పొలం బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దాంతో ఇటీవల ఎన్నికల కమిషన్ ఆయనపై 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం కేసీఆర్ చేసే ప్రసంగంపై జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ మొదలైంది. ఆయన ఎలాంటి వాఖ్యలు చేస్తారనే చర్చ కొనసాగుతోంది. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News