ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన

30 రోజులు గడుస్తున్న ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట రైతులు ఐకెపి సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు.

Update: 2023-05-15 07:46 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: 30 రోజులు గడుస్తున్న ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట రైతులు ఐకెపి సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. జగిత్యాల, ధర్మపురి ప్రధాన రహదారిపై వరి ధాన్యం బస్తాలు వేసి వాటిపై కూర్చొని నిరసన వ్యక్తం చేసారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా పలువురు రైతులు డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో కొద్దిసేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Tags:    

Similar News