కాంగ్రెస్ చేసిన మోసానికి తగిన గుణపాఠం చెప్పాలి : కొప్పుల ఈశ్వర్

అమలుకాని ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పెద్దపెల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

Update: 2024-05-09 10:32 GMT

దిశ, గోదావరిఖని : అమలుకాని ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పెద్దపెల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం గోదావరిఖని బస్ డిపో ఆర్టీసీ సిబ్బందిని కలిసి కాంగ్రెస్ చేసిన మోసాలను ఆయన వివరించారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో ప్రజల తరపున గొంతెత్తాలంటే.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోవద్దని వారు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాటును సరిదిద్దుకొని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతుగా నిలిచి.. భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ తో కలిసి ఆయన అభ్యర్థించారు.

Similar News