వడదెబ్బతో కాంగ్రెస్ మీటింగ్‌కి వెళ్లిన మహిళ మృతి

వడదెబ్బతో కాంగ్రెస్ మీటింగ్ కి వెళ్లిన మహిళ మృతి చెందిన ఘటన

Update: 2024-04-30 13:15 GMT

దిశ,వీణవంక: వడదెబ్బతో కాంగ్రెస్ మీటింగ్ కి వెళ్లిన మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జమ్మికుంట మండలం లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర మీటింగ్ కు వీణవంక మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు మహిళలను తరలించారు.అయితే తీవ్ర ఎండకు తట్టుకోలేక వడదెబ్బతో మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ(60) అనే మహిళ మీటింగ్ ప్రాంగణం వద్ద మృతి చెందింది.మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉండగా ఇటీవలే పెద్ద కుమారుడు మరణించాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది.


Similar News