జగిత్యాలలో క్షుద్ర పూజల కలకలం

జగిత్యాలలో పట్టణంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపాయి. పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో లేబర్ అడ్డా వైపు గల ఓ మెస్ ముందు ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డట్లుగా తెలుస్తుంది.

Update: 2023-05-01 05:42 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాలలో పట్టణంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపాయి. పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో లేబర్ అడ్డా వైపు గల ఓ మెస్ ముందు ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డట్లుగా తెలుస్తుంది. హోటల్ యజమాని కొలగాని అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం హోటల్ తెరిచేందుకు వెళ్లిన క్రమంలో మెస్ షటర్ ముందు కుంకుమ, పసుపు, చల్లి నిమ్మకాయలు పెట్టి ఉండటం కోడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు కనిపించాయి. అయితే మొదట కొంత ఆందోళన చెందినప్పటికీ ఆ తర్వాత తేరుకుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News