MPగా కేఏ పాల్ పోటీ.. పార్టీ చీఫ్‌కు బూస్టింగ్ ఇచ్చేలా బాబు మోహన్ క్లారిటీ

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఎంపీగా పోటీ చేసే అంశంపై ఇటీవల ఆ పార్టీలో చేరిన బాబు మోహన్ క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-03-13 08:57 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఎంపీగా పోటీ చేసే అంశంపై ఇటీవల ఆ పార్టీలో చేరిన బాబు మోహన్ క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో కేఏ పాల్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. విశాఖ నుంచి కేఏపాల్ బరిలో ఉంటారన్నారు. కేఏ పాల్‌కు మద్దతుగా తాను ప్రచారం చేయనున్నట్లు బాబుమోహన్ స్పష్టతనిచ్చారు. అయితే ఇటీవల కేఏ పాల్ మాట్లాడుతూ.. తాను విశాఖ నుంచి బాబు మోహన్ వరంగల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ కు 805 ఓట్లు రాగా.. 2019 ఏపీ ఎన్నికల్లో నర్సాపురం అసెంబ్లీ స్థానానికి కేఏ పాల్ పోటీ చేయగా 281 ఓట్లు వచ్చాయి.

Read More..

వైసీపీ ఫెనల్ లిస్ట్ ముహూర్తం ఫిక్స్.. మేనిఫెస్టో కూడా అక్కడే అనౌన్స్ చేసే చాన్స్!  

Tags:    

Similar News