నేడు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు KA Paul

మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారు.

Update: 2024-02-02 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారు. ట్రాఫిక్ జామ్ సమస్యతో స్టాల్ తొలగింపు.. రేవంత్ సర్కారు జోక్యంతో స్టాల్ కొనసాగింపు వంటి ట్విస్ట్‌లతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే స్టాల్ ను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా రేవంత్ రెడ్డి కన్నా ముందే ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ నేడు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శించనున్నారు. ఇప్పటికే కేఏ పాల్ కుమారి ఆంటీకి తన సపోర్ట్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఫుడ్ స్టాల్ మళ్లీ తెరుచుకోవడంపై కుమారి ఆంటీ స్పందిస్తూ.. 13 ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్నానని తెలిపారు. నోటీసులు ఇవ్వకుండానే తొలగించాలనడంతో రూ.50వేల ఫుడ్ వేస్ట్ అయింది. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్‌పై సీఎం స్పందించడం గొప్ప విషయమన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News