హనుమాన్ భక్తుల ముసుగులో కేటీఆర్‌పై దాడి చేసింది వాళ్లే: జోగు రామన్న

భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి జోగు రామన్న స్పందించారు.

Update: 2024-05-10 07:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి జోగు రామన్న స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కేటీఆర్‌పై బీజేపీ నేతలు దాడికి యత్నించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్ భక్తుల ముసుగులో బీజేపీ వాళ్లే కేటీఆర్‌పై దాడి చేశారని అన్నారు. బీజేపీ కుట్రపై తమకు కచ్చితమైన సమాచారం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గురువారం రాత్రి ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై కొందరు టమాటాలు, ఉల్లిగడ్డలతో దాడి చేశారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News