జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి.

Update: 2024-04-25 02:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. రెండు సెషన్లకు కలిపి ఎన్ టీఏ ర్యాంకులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎన్‌టీఏ ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా ఎన్‌టీఏ కటాఫ్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 56 మందికి వంద పర్సంటైల్ స్కోరు రాగా తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురికి వంద పర్సంటైల్ స్కోరు దక్కింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఈ నెల 27 నుంచి మే 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది.

Similar News