పార్టీలో చేరాలనుకునే వారు అలా చేయాల్సిందే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

పార్టీలో చేరికలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీ సభ్యులు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-01 08:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్టీలో చేరికలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీ సభ్యులు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అధిష్టానం ఆదేశాల రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఘర్ వాపసి అయ్యారని తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా చాలా మందిని పార్టీలోకి ఆహ్వానించామన్నారు. ఇక నుంచి చేరికలు నేరుగా జరగవని.. పార్టీలో చేరాలనుకునే వారు ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి గారి అనుమతితోనే చేరికలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. పార్టీ లో చేరాలనుకునే వారు దీపా దాస్ మున్శిని సంప్రదించాలన్నారు.


Similar News