రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు

వరుసగా రెండో రోజు రియల్ కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కోహినూర్ తోపాటు ఆర్ఆర్ సంస్థకు చెందిన ఆఫీసులు, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ తోపాటు కర్ణాటక

Update: 2023-05-25 10:48 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో : వరుసగా రెండో రోజు రియల్ కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కోహినూర్ తోపాటు ఆర్ఆర్ సంస్థకు చెందిన ఆఫీసులు, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ తోపాటు కర్ణాటక, ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో మొత్తం నలభై చోట్ల దాడులు జరుగుతున్నట్టు సమాచారం. తనిఖీల్లో అధికారులు భారీ మొత్తాల్లో డబ్బు సీజ్ చేసినట్టు తెలిసింది.

Tags:    

Similar News