అటవీ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

అటవీ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హరితహారం గురించి గుర్తు చేసుకుంటు ఆసక్తికర ట్వీట్ చేశారు

Update: 2024-03-21 13:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అటవీ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హరితహారం గురించి గుర్తు చేసుకుంటు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇందులో దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ గారని, తెలంగాణలో మహోద్యమంలా సాగిన ఆనాటి హరితహారం.. 230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పం ప్రపంచ చరిత్రలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమని తెలిపారు. 15 వేల నర్సరీల పెంపకం మహాయజ్ఞంలో సరికొత్త అధ్యాయంగా సాగిందని, వీటితో గ్రీన్ కవర్ 8% పెరిగిందని, తెలంగాణ పునర్నిర్మాణం అంటే.. ప్రజల బతుకుచిత్రాన్ని మార్చడమే కాదు. సకల జీవరాశులను సంరక్షించడమని తెలియజేశారు. అంతేగాక హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను, బీఆర్ఎస్ హయాంలో అభివృద్ది చేసిన పార్కుల ఫోటోలను ట్వీట్ కు జత చేశారు.

Tags:    

Similar News