కేటీఆర్ ఇకనైనా అబద్ధపు ప్రచారాలు మానుకో: ఇందిరాశోభన్ చురకలు

మంత్రి కేటీఆర్ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని ఇందిరా శోభన్ చురకలంటించారు.

Update: 2023-04-02 12:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని ఇందిరా శోభన్ చురకలంటించారు. పాత వార్తలను మంత్రి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారని ఆమె ఆరోపించారు. ఇటువంటి ప్రచారాలు ఎవరిని బ్లఫ్ చేయడానికి? అంటూ ఆమె నిలదీశారు. ఆర్టీఐ నివేదిక ప్రకారం కేవలం 25 వేల రుణమాఫీ మాత్రమే అయిందని, ఇంకా 25వేల నుండి లక్ష వరకు రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. ఇది ఎన్నికల ఏడాది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫి చేస్తుందన్న ఆశతో రైతన్నలు ఉన్నారంటూ మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News