విద్యాజ్యోతి పథకం అమలుచేయండి: MLA మహేశ్వర్ రెడ్డి డిమాండ్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అభయహస్తంలో ఇచ్చిన విద్యాజ్యోతి పథకాన్ని అమలు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అభయహస్తంలో ఇచ్చిన విద్యాజ్యోతి పథకాన్ని అమలు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా అత్యధికంగా 99.09 శాతం సాధించి ప్రథమ స్ధానంలో నిలవడంపై హర్షం వ్యక్తంచేశారు. విద్యాజ్యోతిలో భాగంగా ఇంటర్ పాసయిన ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లకు రూ.15 వేలు, పదో తరగతి ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చిందని, వీటిని అందిచాలని ఏలేటి డిమాండ్ చేశారు. త్వరలోనే పలు యూనివర్శిటీల డిగ్రీ, పీజీ పరీక్షల ఫలితాలు కూడా వెలువడనున్నాయని, డిగ్రీ పాస్ అయితే రూ.25 వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష అందజేస్తామన్న హామీని కూడా అమలుచేయాలని ఏలేటి డిమాండ్ చేశారు.