హైదరాబాద్ పార్లమెంట్ బరిలో 30 మంది… 8 మంది అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ
పార్లమెంట్ ఎన్నికల్లో మరో ప్రధాన ఘట్టం ముగిసింది. సోమవారం నామినేషన్ల చివరి రోజున హైదరాబాద్ పార్లమెంట్ నియోజవర్గం అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించిన వారిలో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు .
దిశ , హైదరాబాద్ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో మరో ప్రధాన ఘట్టం ముగిసింది. సోమవారం నామినేషన్ల చివరి రోజున హైదరాబాద్ పార్లమెంట్ నియోజవర్గం అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించిన వారిలో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మేరకు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వివరాలు వెల్లడించారు. నామినేషన్ల స్క్రూట్నీ అనంతరం 38 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో ఎనిమిది మంది తమ నామినేషన్లకు వెనక్కు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. బరిలో ఉన్న అభ్యర్థులకు సాధారణ పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో సింబల్ లను కేటాయించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ పి ఐ శ్రీవిద్య, డిఆర్వో వెంకటాచారి, నామినేషన్లు వేసిన అభ్యర్థులు పాల్గొన్నారు.
నామినేషన్లు ఉపసంహరించుకున్న వారు ...
1. కుంకుడుపాల రవీందర్ - ఇండిపెండెంట్ అభ్యర్థి
2. మహమ్మద్ అక్రమ్ అలీ ఖాన్ - ఇండిపెండెంట్ అభ్యర్థి
3. మహమ్మద్ వహీద్ అలీ-ఇండిపెండెంట్
4. ఏ రజని - ఇండిపెండెంట్
5. సంజయ్ కుమార్ శుక్ల - ఇండిపెండెంట్
6. గంధం సత్యనారాయణ - ఇండిపెండెంట్
7. జి సుభాష్ చందర్ జీ - ఇండిపెండెంట్
8. ఎస్ సూర్య ప్రకాష్ _ ఇండిపెండెంట్