భారీ మెజార్టీతో రంజిత్ రెడ్డిని గెలిపించండి : సీతా రంజిత్ రెడ్డి

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కుటుంబ సభ్యులు ఓటర్లను కోరారు.

Update: 2024-05-02 09:01 GMT

దిశ, శేరిలింగంపల్లి : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కుటుంబ సభ్యులు ఓటర్లను కోరారు. గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ నలగండ్లలో రంజిత్ రెడ్డి భార్య సీతా రంజిత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గడపలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కోరారు.

తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారని సీతా రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజిత, నియోజకవర్గ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, నల్లగండ్ల గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News