హైదరాబాద్ లో రెండు , సికింద్రాబాద్ లో ఆరు నామినేషన్లు దాఖలు
పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో వివిధ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు.
దిశ , హైదరాబాద్ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో వివిధ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రెండవ రోజు హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి రెండు , సికింద్రాబాద్ నుంచి మొత్తం ఆరుగురు నామినేషన్లను ఆర్వోలకు సమర్పించారు . వీరిలో రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి జీ. కిషన్ రెడ్డి నాలుగు సెట్లు , బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు రెండు సెట్ల నామినేషన్లు , మిగిలిన వారు ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి .
1) హైదరాబాద్ నియోజకవర్గం ...
1. అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం)
2. మహమ్మద్ అక్రమ్ అలీ (స్వతంత్ర)
2)సికింద్రాబాద్ నియోజకవర్గం....
1.చలిక చంద్రశేఖర్ (స్వతంత్ర)
2. జీ .కిషన్ రెడ్డి (బీజేపీ)
3. బీ రాఘవేంద్ర (సోషలిస్టు యూనిటీ సెంబర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు)
4. కొలిశెట్టి శివకుమార్ ( యుగ తులసి పార్టీ)
5. టీ పద్మారావు (బీఆర్ఎస్)
6. బీరంగంటి సునీతా రాణి (సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియా)