నగరవాసులకు షాకింగ్ న్యూస్.. ఆదివారం చికెన్, మటన్ షాపులు బంద్

ఆదివారం వచ్చిందంటే చాలు హైదరాబాద్ వాసులు చికెన్, మటన్ షాపుల్లో క్యూ కడతారు.

Update: 2024-04-17 13:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం వచ్చిందంటే చాలు హైదరాబాద్ వాసులు చికెన్, మటన్ షాపుల్లో క్యూ కడతారు. మనలో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. మిగతా రోజులు ఎలా ఉన్నా సరే ఆదివారం మాత్రం ఇంట్లో నాన్‌వెజ్ ఉండాల్సిందే. అయితే తాజాగా నగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) షాకింగ్ న్యూస్ చెప్పింది. మహావీర్ జయంతి జైనులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండగ. కాగా, W మహావీర్ జన్మదినం సందర్భంగా కబేళాలు, మీట్, బీఫ్ మార్కెట్లతో పాటు మాంసం షాపులు కూడా బంద్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వెల్లడించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News