మైనర్ బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న ఓ యువకుడిని సుల్తాన్ బజార్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Update: 2024-05-23 13:45 GMT

దిశ,కార్వాన్ : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న ఓ యువకుడిని సుల్తాన్ బజార్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సుల్తాన్ బజార్ ఏసిపి శంకర్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.. నల్గొండ జిల్లాకు చెందిన హరి కృష్ణ (30) ఈ నెల 11న సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుంచి మైనర్ బాలికను మాయ మాటలతో కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకువెళ్లి హనుమాన్ మందిరంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఓ లాడ్జి కి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.

ఇతనికి ఇంతక ముందే వివాహం జరిగి విడాకులు తీసుకున్నాడు. ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలించి విశ్వసనీయ సమాచారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న హరికృష్ణను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసా చారి. ఎస్ ఐ లు తదితరులు పాల్గొన్నారు.

Similar News