పద్మశాలి సమాజం బీజేపీని గెలిపించాలి : కిషన్ రెడ్డి

భారత దేశానికి స్వాత్యంత్రం వచ్చాక మొట్ట మొదటి బీసీ ప్రధాని మోదీ అని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-05 09:26 GMT

దిశ, అంబర్ పేట: భారత దేశానికి స్వాత్యంత్రం వచ్చాక మొట్ట మొదటి బీసీ ప్రధాని మోదీ అని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఖాదీని ప్రమోట్ చేస్తున్నారని, వారు తీసుకున్న చర్యలతోనే ఖాదీ ఉత్పత్తి పెరిగిందన్నారు. అంబర్ పేటలో ఆదివారం జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఖాదీ బట్టలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

పద్మశాలీ సమాజం హిందూహిజానికి దగ్గరగా ఉంటుందన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆలే నరేంద్రలు సమాజ హితం కోసం పనిచేసి రాష్ట్రంలో గొప్ప గుర్తింపు పొందారని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో పద్మశాలి సమాజం బీజేపీని గెలిపించి నన్ను ఆశీర్వదించాలని, మోదీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగు పావని, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏనుగు వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకుడు వనం రమేష్, పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Similar News