మొదటి రోజు నో నామినేషన్స్

లోక్ సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడడంతో ఎన్నికల బరిలో ఉన్న నాయకులు తమ నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటుండగా మొదటి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

Update: 2024-04-18 11:23 GMT

దిశ , హైదరాబాద్ బ్యూరో : లోక్ సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడడంతో ఎన్నికల బరిలో ఉన్న నాయకులు తమ నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటుండగా మొదటి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ , ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల మద్య పోటీ ఉండగా నామినేషన్ల సమర్పణ కోసం 25వ తేదీ వరకు గడువు మిగిలి ఉండటంతో మంచిరోజు కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంఐఎం, సికింద్రాబాద్ బీజేపీ ఖాతాలో ఉన్నాయి.


Similar News