విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి

హైదరాబాద్ కృష్ణానగర్‌లో దారుణం చోటుచేసుకుంది.

Update: 2024-05-03 11:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కృష్ణానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌- కృష్ణానగర్ దారిలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తుమ్మ భావన రుషి(35), అతని భార్య సుజాత కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం రోడ్‌పై నడుచుకుంటూ వెళ్తోన్న సమయంలో రుషి చేయి విద్యుత్ స్తంభానికి తాకింది. ఈ క్రమంలో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని చెక్ చేయగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం విద్యుత్ అధికారులపై రుషి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News