ఓయూ పోలీసుల కస్టడీలో క్రిశాంక్

బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నె క్రిశాంక్ ను ఓయూ పోలీసులు కష్టడికి తీసుకొని విచారిస్తున్నారు.

Update: 2024-05-05 13:33 GMT

దిశ, సికింద్రాబాద్: బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నె క్రిశాంక్ ను ఓయూ పోలీసులు కష్టడికి తీసుకొని విచారిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్ తో దుష్ప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన మన్నె క్రిశాంక్ ను నాంపల్లి కోర్టు అనుమతితో ఒక్కరోజు కస్టడిలోకి తీసుకున్నారు. పోలీసులు రెండు రోజులు కస్టడీకి అనుమతి కోరగా న్యాయస్థానం ఒకరోజు అనుమతి ఇచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు క్రిశాంక్ తమ కస్టడీలో ఉండనున్నట్లు ఓయూ పోలీసులు చెప్పారు. ఫేక్ సర్క్యులర్ ఎలా తయారు చేశారు, ఎవరూ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు.

కస్టడీలోకి తీసుకున్నప్పుడు క్రిశాంక్ ఫోన్ కనిపించడం లేదని, దానిపై కూడా పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. క్రిశాంక్ తో పాటు ఆయన అడ్వకేట్ లక్ష్మణ్ పిఎస్ కు హాజరయ్యారు. క్రిశాంక్ ఫేక్ సర్క్యులర్ తయారు చేయలేదని, జన్యూన్ సరిక్యులర్ పోస్టు చేశానని, లాస్ట్ ఇయర్ చీఫ్ వార్డెన్ జారీ చేసిన సర్క్యులర్ మాత్రమే పోస్టు చేశానని చెప్తున్నాడని తెలిపారు. దానిమీదనే తాను వాదనలు వినిపిస్తున్నట్లు చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపిస్తే క్రిశాంక్ సంతకాలు ఫోర్జరీ చేశాడా లేదా అన్న విషయం తెలుస్తుందన్నారు.

Similar News