కోవిడ్ వ్యాక్సిన్ వల్లే రక్త గడ్డకట్టడంతో మరణాలు సంభవిస్తున్నాయి : డాక్టర్ జి. వసంత్ కుమార్

కోవిడ్ వ్యాక్సిన్ వల్లే రక్త గడ్డకట్టడంతో మరణాలు సంభవిస్తున్నాయని సుల్తాన్ బజార్ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ జి. వసంత్ కుమార్ అన్నారు

Update: 2024-05-04 15:50 GMT

దిశ, ఖైరతాబాద్ : కోవిడ్ వ్యాక్సిన్ వల్లే రక్త గడ్డకట్టడంతో మరణాలు సంభవిస్తున్నాయని సుల్తాన్ బజార్ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ జి. వసంత్ కుమార్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, ఇటీవల బహిర్గతమైన నేపథ్యంలో మన దేశంలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులకు వ్యాక్సిన్లు వేయగా, ఇప్పటికే పదుల సంఖ్యలో వివిధ రకాల స్ట్రోక్స్ వల్ల వైద్యులు చనిపోయారని తెలిపారు.

బంగ్లాదేశ్ లో సైతం ఇదే వ్యాక్సిన్ వైద్యులకు వేయగా, అక్కడా మృత్యువాత పడ్డారని తెలిపారు. కోవిడ్ కు సంబంధించిన వ్యాక్సిన్లు వేసుకున్న 90 కోట్ల మందికి ముప్పు ఉందన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కొవిడ్ వ్యాప్తి ఆగదని స్వయంగా వాటిని తయారు చేసిన కంపెనీలే వెల్లడించాయన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ తో కాలేయంతో పాటు విటమిన్ డీ3, బీ12 లోపాలు వస్తున్నాయని, రక్తం గడ్డకట్టడం తో పాటు ప్లేట్లెట్లు కూడా పడిపోతున్నాయన్నారు.

ప్లేట్లెట్స్ పడిపోవడాన్ని వైద్య పరిభాషలో త్రొండోసైటోపీనియాగా పిలుస్తారన్నారు. కోవిడ్ చికిత్సలో నియోగించిన రెమిడెసీవర్ను కార్డియో టాక్సిక్ డ్రగ్ అంటారని, ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దేశంలో రెమిడెసీవర్ అమ్మకాల ద్వారా అది తయారు చేసిన కంపెనీకి రూ.2 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందన్నారు. బ్రిటిష్ వారి కుట్రలో భాగంగా భారత్ పై ఆస్ట్రాజెనెకా, కొవిషీల్డ్ వ్యాక్సిన్ను వదిలారన్నారు. వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ్సక్సు చికిత్సలు అందుబాటులో ఉందని, ఇప్పటికే ఐసీఎంఆర్ గుర్తింపు కోసం దరఖాస్తులను పంపించానని తెలిపారు.

Similar News