HYD: భానుడి భగభగలు.. నగరంలో అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతపాన్ని చూపిస్తున్నాడు.

Update: 2024-03-03 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా నగర పరిధిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆఫీసులకు వెళ్లే వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు తీవ్ర సతమతమవుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉష్ణోగ్రతలు ఎల్బీనగర్ 35 డిగ్రీలు, బేగంపేటలో 34 డిగ్రీలు, జూబ్లీ హిల్స్‌లో 33 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని హెచ్చరించింది.  

Tags:    

Similar News