HYD : నైజీరియన్లు ఉండే ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు
హైదరాబాద్ రాజేంద్రనగర్, నార్సింగిలో పోలీసులు నిర్భంధ తనిఖీలు చేపట్టారు.
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ రాజేంద్రనగర్, నార్సింగిలో పోలీసులు నిర్భంధ తనిఖీలు చేపట్టారు. సన్సిటీ, హైదర్ షా కోట్లోని నైజీరియన్లు ఉండే ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క నైజీరియన్ను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. నైజీరియన్ల పాస్ పోర్టులు, వీసాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీసా గడువు ముగిసినా కొందరు అక్రమంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఉన్నాయా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. సన్ సిటీ అడ్డాగా కొన్నాళ్లుగా నైజీరియన్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ గతంలో నైజీరియన్లు అనేక సార్లు పట్టుబడ్డారు.