హైదరాబాద్లో మరోసారి హిజాబ్ వివాదం కలకలం
హయత్ నగర్లో హిజాబ్ వివాదం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. హయత్ నగర్లోని జీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ముఖానికి స్కార్ఫ్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హయత్ నగర్లో హిజాబ్ వివాదం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. హయత్ నగర్లోని జీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని వచ్చింది. దాంతో స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థినిని ఇంటికి పంపించి వేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.