Heavy Rain Effect : పలు రైళ్ల సర్వీసులు నిలిపివేత

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా హసన్‌పర్తి-కాజీపేట మధ్య నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

Update: 2023-07-27 08:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా హసన్‌పర్తి-కాజీపేట మధ్య నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఇరువైపులా పలు రైలు సర్వీసులను నిలిపివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ (ట్రైన్ నం. 17012) మధ్య నడిచే రైలును ఇవాళ రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతి-కరీంనగర్ (12761), కరీంనగర్- తిరుపతి(12762), సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ (12757), సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్(12758) మధ్య నడిచే రైళ్లను ఇవాళ పాక్షికంగా నిలివేస్తున్నట్లు పేర్కొంది. యశ్వంత్‌పూర్- హజ్రత్‌నిజాముద్దీన్(12649),యశ్వంత్‌పూర్-గోరక్‌పూర్(22534), సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్ధీన్(12285) రైళ్ల సర్వీసులు డైవర్షన్ తీసుకుంటాయని ప్రకటించింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News