ప్రభుత్వానికి Governor Tamilisai సూచన!

తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశారు. విజయ్ దివస్‌ను తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ పాఠశాల్లో జరపాలని సూచించారు.

Update: 2022-12-16 06:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశారు. విజయ్ దివస్‌ను తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ పాఠశాల్లో జరపాలని సూచించారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్ పై భారత బలగాలు సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి యేటా జరుపుకునే విజయ్ దివస్ వేడుకలు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండో పాక్ వార్‌లో ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేశారని గుర్తు చేశారు. సైనికుల త్యాగాలను ప్రతి విద్యార్థి, ప్రతి యువత స్మరించుకునేలా వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు.

Also Read....

జాతీయ రాజకీయాల్లో KCRకు గట్టి షాక్ 

Tags:    

Similar News